బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

-

రొహింగ్యాల ఏరివేతకు పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్స్ ని మంత్రి కేటీఆర్‌ తప్పు బట్టారు. కొన్ని ఓట్లు, కొన్ని సీట్ల కోసం బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తన సహచరుడు బండి సంజయ్‌ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. నేడు జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హబ్సిగూడ ప్రచారంలో బీజేపీ అభ్యర్ధి మేయర్ అయితే పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేసి రోహింగ్యాలను పాకిస్తాన్ వాళ్లను తరిమి తరిమి కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా ఓట్లు లేని ఎన్నికలు హైదరాబాద్లో జరగాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవలే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. దానికి సమాధానంగానే ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news