రేపు ధర్నా చౌక్ లో రైతు దీక్ష – మహేశ్వర్ రెడ్డి

-

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేపు ధర్నా చౌక్ లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష ఉంటుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామని తెలిపారు.

రైతు హామీల సాధన దీక్ష ను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదిలిరావాలని పిలుపునిచ్చారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news