నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. బాలిక కుటుంబం చేతిలో హతం

-

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి.. బాధిత బాలిక కుటుంబీకుల చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇడుపులపాటి దాసు (32) మద్యం మత్తులో వరుసకు కూతురైన నాలుగేళ్ల బాలికను గురువారం తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. భయంతో ఆ పాప పరుగులు తీసి అక్కణ్నుంచి పారిపోయింది.

వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు రాత్రి మాట్లాడుకుందాం రమ్మంటూ దాసును గ్రామానికి సమీపంలోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడ అతడిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. కొన ఊపిరితో ఉన్న దాసును తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టారు.

తెల్లవారాక మంచంపై విగతజీవుడిగా పడి ఉన్న దాసును గమనించి సోదరుడు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతడి వ్యవహారశైలి నచ్చక వారు విడిగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version