మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు : హరీష్ రావు

-

కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. ఒక విశ్వాసం అని అన్నారు మంత్రి హరీష్​రావు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని చెప్పారు. తెలంగాణ వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నర్సాపూర్​లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ఎంపీగా చేసే బాధ్యత తనదే అన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంటే ఇస్తున్నామని తామే చెప్పామన్నారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న (అక్టోబర్ 28న) డీకే శివకుమార్ నిజాలు చెప్పారని తెలిపారు. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడన్నారు.

మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. “రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. తస్మాత్ జాగ్రత్త.. మోసపోతే గోస పడుతాం. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్ వాళ్లు బట్టేబాజ్ గాళ్ళు వాళ్ళవి తిట్లు…మనవి కిట్లు. కాంగ్రెస్ బూతులు కావాలా…తెలంగాణ భవిష్యత్తు కావాలా.” అని మంత్రి హరీశ్ రావు ప్రజలకు సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version