విజయశాంతి డైలాగ్ చెప్పేసిన రోజా…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పుడు వైసీపీ నేతలు సినిమా డైలాగులను వరుసగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా జగన్ ని కొనియాడుతూ కొన్ని డైలాగులు వాడేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రోజా కూడా ఒక డైలాగ్ వాడేసారు. శాసన సభలో మండలి రద్దుపై చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి చెప్పిన డైలాగ్ చెప్పారు.

“అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన బిల్లులను చూసి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఆరు దశాబ్దాల తమ ఆశలు, ఆశయాలను నెరవేర్చే నాయకుడు వచ్చాడని సంతోషిస్తున్నారన్నారు. ఇక్కడే మహేష్ గురించి విజయశాంతి చెప్పిన డైలాగ్ వాడేసారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడు అని ప్రజలు అంటున్నారు.” అని డైలాగ్ చెప్పేశారు.

3648 కి.మీ పాదయాత్రలో జగన్ తనకు అయిన గాయాలు మర్చిపోయి ప్రజల గాయాలు తెలుసుకుని వాటికి చికిత్స చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా లోకేష్ పై కూడా విమర్శలు చేసారు. “దమ్ముంటే శాసనమండలిని రద్దు చేయాలని దద్దోజనం అంటున్నారు. ఆ లోకేష్‌కు చెబుతున్నా. డిక్కి బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడగొడితే కోసి కారం పెట్టి కూరయిపోతుందని ఆమె ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version