బ్రేకింగ్: రఘురామకు మొదలైన వైద్య పరిక్షలు

-

ఎంపీ రఘురామ కృష్ణం రాజు కు సికింద్రాబాద్ మిలిటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జ్యుడీషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ హాస్పిటల్ కు చేరుకున్న జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు కు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం పరిక్షలు నిర్వహిస్తుంది. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు.

మెడికల్ రీపోర్ట్స్ మొత్తం షీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి న్యాయధికారి సమర్పిస్తారు. చికిత్స కాలాన్ని మొత్తం జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణం రాజును ఎవరూ కలవడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. దీనితో ఏం జరగబోతుంది ఏంటీ అనే ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version