సినిమాలపై ఎంట్రీపై ధోని సంచలన ప్రకటన..మహేష్‌ బాబుతోనే !

-

మహేంద్ర సింగ్ ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

ఈ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కు ధోని భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రమేష్ తమిళమని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆయన రాసిన అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోని-తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తర్వాత-తెలుగు, మలయాళం లో వరుసగా ఎంఎస్ ధోని సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version