అందరం కలిసి తరిమికొడదాం.. నమ్రత వీడియో వైరల్

-

కరోనా వైరస్‌పై అవగాహన కలిగించేందుకు సెలెబ్రిటీలందరూ నడుంబిగించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తారతమ్యాలు లేకుండా.. కరోనా నివారణకు, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాటించవలసిన నియమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది వీడియో సందేశాలను విడుదల చేస్తున్నారు.

నిన్న మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో బైట్‌ను వదిలాడు. కరోనా పట్ల భయం, నిర్లక్ష్యం గానీ ఉండకూడదని హెచ్చరించాడు. బయటకు వెళ్లొద్దని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దామని షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని సూచించాడు.

తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా ఓ వీడియోను షేర్ చేసింది. ‘కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా చక్కటి మార్గం. 20 నుంచి 40 క్షణాల పాటు చేతులు కడుక్కోవడానికి సమయాన్ని వినియోగించి సూక్ష్మజీవులను నాశనం చేయొచ్చు. అందరం కలిసి కరోనాను తరిమికొడదామ’ని చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version