ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది : లోకేష్‌

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు టిడిపి జాతీయ అధికార పార్టీ కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చిందని.. మరోసారి ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు నారా లోకేష్.

“రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేసారు సిఎం జగన్. ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో నిద్రపోతున్న సిఎం జగన్ లో చలనం లేడు.” అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.

రూ.200 కోట్లకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వైసీపీ సర్కార్ .. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణమన్నారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version