అయోధ్య రామాలయ ఆహ్వాన పత్రిక ఎలా ఉందో చూశారా?

-

అయోధ్య రాముడి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వేళవుతోంది. జనవరి 22వ తేదీన జరగబోయే ఈ బృహత్తర కార్యక్రమం కోసం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న ఈ కల మరో పది రోజుల్లో సాకారం కాబోతోంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అతిరథ మహారథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

రామ జన్మభూమి ట్రస్టు ముఖ్య అతిథులకు ఆహ్వానాలను పంపిస్తోంది. ఇందులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయితే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రామ జన్మభూమి ట్రస్టు ఈ ఆహ్వాన పత్రికలను తాజాగా ఆవిష్కరించింది. ఈ పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి లిపిలో లిఖించారు.

మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్‌ నిమంత్రన్‌ (అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం) అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర ముఖభాగాన్ని ముద్రించారు. ఇక ఇన్విటేషన్ తెరవగానే రెండో పేజీలో అందమైన బాలరాముడి రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత పేజీలో ప్రాణప్రతిష్ఠకు హాజరు కానున్న విశిష్ట అతిథుల పేర్లున్నాయి. జనవరి 22వ తేదీన ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిరనక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వానపత్రికలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version