గుడ్​న్యూస్.. 3కోట్ల కుటుంబాలకు త్వరలో కొత్త ఇళ్లు

-

మోదీ 3.0 కేబినెట్ తొలిసారిగా సోమవారం సాయంత్రం భేటీ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ తన తొలి నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరగగా.. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కేబినెట్‌ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పని చేయాలని సూచించారు. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అక్కడి అధికారులకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version