BREAKING : ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం

-

దిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పీతంపుర ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగు సజీవదహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీతంపురలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. అగ్నిమాపక దళాలు స్థానిక పోలీసుల సహాయంతో ఏడుగురిని రక్షించారని వెల్లడించారు. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి పైన ఉన్న మూడు ఫ్లోర్లను పొగ కమ్మేసిందని వివరించారు.

మృతులంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారని వీరి వయసు 25 నుంచి 60 మధ్య ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version