జమ్ముకశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 72 గంటల్లో మూడోసారి

-

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రదాడులు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ అమరులయ్యారు. ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.

ఇటీవలే యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున జరిగిన ఈ ఘటన మరవకముందే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లోని ఒక ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంటి యజమాని గాయాలపాలయ్యారు. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు, పారామిలిటరీ బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version