బాల్య వివాహాల్లో ఏ రాష్ట్రం ముందుంది..? భయపెడుతున్న లాన్సెట్‌ నివేదిక

-

టెక్నాలజీ ఇంత ముందుకు వెళ్తుంది.. అయినా జనాలు ఇంకా మూఢనమ్మకాలను, అనాదిగా వస్తున్న అవసరం లేని ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ఆడపిల్ల అంటే.. కేవలం పెళ్లి చేయడానికి, పిల్లలను కనడానికి మాత్రమే ఉపయోగపడే వస్తువు అని అనుకునే ధోరణి ఇంకా ఉందంటే.. నమ్మగలరా..? ఇండియాలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల్లో ఏ రాష్ట్రం ముందో తెలుసా..?

భారతదేశంలో బాల్య వివాహాలపై ఆశ్చర్యకరమైన నివేదిక లాన్సెట్‌లో ప్రచురించబడింది. మొత్తంమీద భారతదేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టగా, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లో అది పెరిగింది. లాన్సెట్ ఈ దేశంలో బాల్య వివాహాలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. మొత్తంమీద భారతదేశంలో బాల్యవివాహాలు తగ్గాయని చెప్పారు.

లాన్సెట్ నివేదికలో బీహార్‌లో 16.7 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 15.2 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.5 శాతం, మహారాష్ట్రలో 8.2 శాతంగా నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో బాలికల బాల్య వివాహాల ప్రాబల్యం, వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదిక పేర్కొంది. దీంతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. పోరాడుతున్న రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ పేరు ఉదాహరణ.

భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సర్వే చేశారు.. బాలికలు, అబ్బాయిల బాల్య వివాహాలపై సర్వే నిర్వహించారు. 1993-2021 వరకూ డేటా తీసుకుని జరిపిన ఈ సర్వేలో ఐదుగురు బాలికలలో ఒకరు చట్టబద్ధమైన వయస్సు కంటే ముందే వివాహం చేసుకున్నట్లు తేలింది..

బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్రంలో అనేక ఆర్థిక ప్రోత్సాహకాలు అమలులోకి వచ్చాయి. బాల్య వివాహాల నివారణకు మమతా బెనర్జీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కన్యాశ్రీ లేదా రూపశ్రీ పథకాల యొక్క ఆర్థిక ప్రయోజనాలు 18 సంవత్సరాల వయస్సు వరకు వివాహం చేసుకోని బాలికలకు అందించబడతాయి. రాష్ట్రం యొక్క ఈ పథకాలు ఐక్యరాజ్యసమితిచే కూడా గుర్తించబడ్డాయి. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

బీహార్‌ అంటేనే నేరాలకు రాజధానిగా మారింది. ఇప్పుడు అక్కడ బాల్యవివాహాలు కూడా ఎక్కువే నమోదు అవడం ఆ రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతుంది. నేరగాళ్లకు, దొంగలకు బీహార్‌ అడ్డాగా మారిందని ఇప్పటికే ఎంతోమంది అభిప్రాయ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version