Lok Sabha elections 2024: నేడు లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్..మొత్తం 49 స్థానాలు ఇవే

-

Lok Sabha elections 2024 Stage set for fifth phase of voting on 49 seats: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Lok Sabha elections 2024 Stage set for fifth phase of voting on 49 seats

UPలో 14, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ 5, ఒరిస్సా 5, జార్ఖండ్ 3, జమ్మూకాశ్మీర్ లో 1, లద్దాక్ లో ఒక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్​నాథ్​ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూశ్ గోయల్, ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్​బరేలీ నుంచి రాహుల్ బరిలో దిగగా, లఖ్​నవూ స్థానంలో రాజ్​నాథ్ సింగ్, అమేఠీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version