బీజేపీ నేతలంతా.. రావణుడి భక్తులే : మంత్రి వివాదాస్పద వ్యాఖ‍్యలు

-

రాజస్థాన్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలంతా రాముడి భక్తులు కాదని.. రావణుడి భక్తులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… బిజెపి నేతలు రాముడి విధానాన్ని పాటించడం లేదని… వాళ్లు రావణుడి పాలసీని పాటిస్తున్నారని విమర్శలు చేశారు.

మరో అడుగు ముందుకేసి… రాముడు అందరిని సమానంగా చూశాడని… అదే రావణుడు ఒక మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో బిజెపి ఎలాగైతే… కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం టికెట్లను పంచి పెడుతున్నారో… అలాగే పెట్రోల్ మరియు డీజిల్ కోసం కూడా కూపన్లు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ… కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెరుగుతుందని ఆయన నిప్పులు చెరిగారు. ఇకనైనా… పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వాటి ధరలను తగ్గించి ప్రజలను కాపాడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news