ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు..భారీగా బంగారం నగదు సీజ్

-

కోల్కాత్తా కు చెందిన ఓ కంపెనీ తో మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారని చాలా రోజుల నుంచి ఆమ్ ఆద్మీ కీలక నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సత్యేంద్ర జైన్ ఇంటిలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) సోదాలు నిర్వహించింది.ఈ సోదాల్లో మంత్రి ఇంటిలో 1.80 కిలోల బంగారం,రూ.2.82 కోట్ల నగదు లభ్యం అయింది.

ఈ బంగారం, నగదుకు సంబంధించి సత్యేంద్ర జైన్ సరైన వివరాలు చెప్పకపోవడంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సత్యేంద్ర జైన్ ఇంటిలో తాజాగా సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడడంతో ఆయన అక్రమ లావాదేవీలకు సంబంధించిన మరింత సమాచారం లభించింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version