తెలుగు ఫ్యాన్స్ కు షాక్..HYDలో ఇండియా మ్యాచ్ లేదు

-

వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. తాజాగా ఐసిసి దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. పదేళ్ల తర్వాత జరిగే ఈ ప్రపంచకప్ వన్డే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది.

అయితే, ICC వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో 3 మ్యాచ్లు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్తాన్, క్వాలిఫైయర్-1 జట్ల మధ్య, అక్టోబర్ 9న న్యూజిలాండ్, క్వాలిఫైయర్-1 జట్ల మధ్య అక్టోబర్ 12న పాకిస్తాన్, క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి. అయితే టీం ఇండియా ఆడనున్న ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాదులో జరగడం లేదు. దీంతో ఇది తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version