కాబోయే భర్తకు ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చిన నయనతార.. ధర తెలిస్తే షాక్..!!

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా ప్రముఖ సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మహాబలిపురం లో ఉదయం ఒక్కటి కాబోతున్నారు. ఈ నూతన వధూవరులను ఆశీర్వదించ డానికి ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అంటూ వీరిపై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక పోతే వీరి పెళ్లికి హాజరైన అతిథులు కూడా డ్రెస్ కోడ్ ను పాటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే కత్రినాకైఫ్ లాగే వీరు కూడా తమ వివాహానికి సంబంధించిన విషయాలను వివరాలను అతిథులకు తప్ప మరెవ్వరికి తెలియనివ్వలేదు అని సమాచారం.వీరి వివాహ వేడుకను నెట్ ఫ్లెక్స్ ఓ టీ టీ వేదిక గా ప్రసారం చేయనున్నారు. ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న మరొక విషయం ఏమిటంటే నయనతార తన కాబోయే భర్త కు ఒక ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇస్తున్నట్లు సమాచారం. ఇక సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ బంగ్లా ధర సుమారుగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఆ ఇంటిని తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్ పేరు పై నయనతార రిజిస్ట్రేషన్ కూడా చేయించబోతున్నట్లు సమాచారం. విఘ్నేష్ శివన్ కూడా నయనతార కోసం తమ పెళ్ళి కానుకగా ఖరీదైన నగలను కొనుగోలు చేశారు అని వాటిని పెళ్లిరోజు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తమ వివాహ వేడుకను పురస్కరించుకుని.. ఒకరికి మరొకరు ఖరీదైన కళ్ళు చెదిరే కానుకలు ఇచ్చుకోవడం గమనార్హం. అంతే కాదు విఘ్నేష్, నయన్ కి ఖరీదైన ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. వివాహానంతరం నయనతార బహుమతిగా ఇచ్చిన కొత్త ఇంటిలో వీరిద్దరు కాపురం పెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సెలబ్రిటీల పెళ్లి వివాహం మాత్రం సినీ ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version