భారీ విరాళం ప్రకటించిన తారక్…!

-

కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి అందరూ ముందుకి వస్తున్నారు. ఎవరికి వారుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. స్టార్ హీరోలు నటులు, దర్శకులు ఇలా ఎవరికి వారుగా ముందుకి వచ్చి సహాయం చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, త్రివిక్రమ్, వీవి వినాయక్ ఇలా ఒకరి తర్వాత ఒకరు సహాయ౦ చేస్తున్నారు. దీనిపై పలవురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనాపై పోరాటానికి గాను 75 లక్షల సహాయం ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షలు, తెలంగాణా ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, సినీ కార్మికుల కోసం 25 లక్షలు సాయం ప్రకటించాడు. దీనిపై ప్రసంశల వర్ష౦ కురుస్తుంది. మహేష్ బాబు ఏకంగా కోటి రూపాయల సాయం ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కూడా రెండు కోట్లు సాయం చేసాడు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 60 కేసుల వరకు నమోదు అయ్యాయి. అయితే వీరిలో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 700 కి దగ్గరలో ఉన్నాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు కరోనా కేసులు చేరాయి. 22 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news