సింగర్ కేకే మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

-

కేకే గా సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణ కుమార్ కన్నాధ్ గారి అకాల మరణం బాధ కలిగించింది అన్నారు పవన్ కళ్యాణ్. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీ ని కలిగిన గాయకుడు శ్రీ కేకే గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి అన్నారు. ఖుషి చిత్రం కోసం ‘ఏ మేర జహా’ గీతం అన్ని వయసుల వారికి చేరువైందన్నారు.

జల్సా సినిమాలో ‘మై హార్ట్ ఇస్ బీటింగ్’..అదోలా: బాలు.. ‘ఇంతే ఇంతింతే’ జానీ సినిమాలో ‘నాలో నువ్వొక సగమై’ గుడుంబా శంకర్ లో ‘లే లే లేలే’ గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారని గుర్తుచేసుకున్నారు. సంగీత కచేరీ ముగించుకున్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన చివరి శ్వాస వరకు పాడుతూనే ఉన్నారు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version