తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీకృష్ణ

-

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని మేడారం వనదేవతలను కోరుకున్నట్లు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ అన్నారు.రామకృష్ణపూర్లో సమ్మక్క, సారక్క దేవతలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. చెన్నూర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామని అన్నారు.

తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోందని పేర్కొన్నారు. అయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ లీడర్లు,కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version