స్టాలిన్‌తో భేటీ అయిన చంద్ర‌బాబు

-

చెన్నై: బిజేపీయేత‌ర‌ రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అంశంలో భాగంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్ర‌వారం భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరి వెళ్లిన చంద్రబాబు నేరుగా స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు డీఎంకే నేతలు ఘనస్వాగతం పలికారు. మోడీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటులో చంద్రబాబు చేస్తున్న కృషిని స్టాలిన్‌ ఇటీవల స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్టాలిన్‌ను క‌లవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో స్టాలిన్‌తో పాటు డీఎంకే ముఖ్య నేతలు కనిమొళి, టీఆర్‌ బాలు, రాజా పాల్గొన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, ఎంపీ సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version