బాలకృష్ణ నక్షత్రాలను అంత బలంగా నమ్ముతారా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని పర్యటన కోసం నందమూరి, నారా కుటుంబాలు వస్తున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షకు నారా నందమూరి కుటుంబాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో తన భార్య నారా భువనేశ్వరి తో కలిసి వచ్చి రైతుల దీక్షకు మద్దతు పలికారు.

సంక్రాంతి రోజున నందమూరి కుటుంబం కూడా అమరావతి ప్రాంతానికి వచ్చింది. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ పర్యటనకు రాలేదు. ఆయన కనుమ రోజు వస్తారని, తమకు మద్దతు ప్రకటిస్తారని రాజధాని ప్రాంత రైతులు ఆశగా ఎదురుచూసారు. ఆయనోస్తే తమకు మద్దతు కూడా కొన్ని వర్గాల నుంచి పెరుగుతుందని భావించారు. రాజధాని కోసం టాలివుడ్ నుంచి ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు.

బాలకృష్ణ వస్తే సిని ప్రముఖులు కూడా తమకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని ఎదురు చూసారు. అయితే బాలకృష్ణ మాత్రం కనుమ రోజు రాలేదు. దీనికి కారణం నక్షత్ర బలం లేకపోవడమేనని అంటున్నారు. ముహూర్తాలను ఎక్కువగా నమ్మే బాలకృష్ణ గురువారం నక్షత్ర బలం, ముహూర్త బలం లేపోవడంతో దూరంగా ఉన్నారని ఆయన తండ్రి వర్ధంతి అయిన 18న రాజధాని ప్రాంతానికి వచ్చి మద్దతు పలుకుతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news