కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన…. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన

-

తెలంగాణలో కాంగ్రెస్  పార్టీని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో తక్కువ సమయం ఉంటూ…. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటాం అని ఆయన అన్నారు. సంవత్సరం లోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. వడ్ల గురించి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేదని… ఎన్నికల వ్యూహాలు పన్నేందుకే ఢిల్లీ వెళ్లారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవితల మధ్య సఖ్యత లేదని… ఖమ్మంలో తుమ్మల, అజయ్ కుమార్ మధ్య విభేధాలు లేవా..? అని ప్రశ్నించారు. ఒక 15 రోజులు ఢిల్లీ నుంచి కేసీఆర్ రాకపోతే కేటీఆర్, కవిత, హరీష్ రావులు ప్రగతి భవన్ లోనే కత్తులతో పొడుచుకుంటారని వ్యాఖ్యానించారు. మాది 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని మా పార్టీలో కూడా విభేదాలు ఉంటాయని… అవన్నీ సమసిపోతాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news