గ్రేటర్ సైరన్: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా బిజెపి

-

కాసేపటి క్రితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా బిజెపి నేతలు దూకుడు పెంచారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించింది రాష్ట్ర పార్టీ. మల్కాజిగిరి రఘునందన్ రావు, శేరిలింగంపల్లికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి బాధ్యతలు ఇచ్చింది. అంబర్ పేట రేవూరి ప్రకాష్ రెడ్డి కి బాధ్యతలు ఇచ్చింది.

ఎల్బీ నగర్ సంకినేనికి బాధ్యతలు ఇవ్వగా… మహేశ్వరం యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. నాంపల్లికి అదిలాబాద్ ఎంపీ సాయం బాపురావుకి అప్పగించింది. కూకట్ పల్లికి గానూ… పెద్దిరెడ్డికి, రాజేంద్రనగర్ మోత్కుపల్లికి, నియోజకవర్గంలో ని అన్ని డివిజన్ల బాధ్యత ఇంచార్జ్ లకు అప్పగించింది. ఇంచార్జ్ లు డైలీ రిపోర్ట్ ఇవ్వాలని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news