చంద్రబాబు సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టిన ఎంపీ విజయసాయి రెడ్డి..!

-

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మ‌రో సారి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందని, సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులకు ప్రమాదం ఉందంటూ ఎకనామిక్స్‌ టైమ్స్‌లో వచ్చిన కథనంపై విజయసాయి తనదైన శైలిలో స్పందించారు. ఆ పేపర్లో ఏదో కథనం వచ్చిందని బాబు భజంత్రీలు మురిసిపోతున్నారు.

అంతర్జాతీయ మీడియా ని మేనేజ్ చేసినోళ్లకు జాతీయ మీడియా ఒక లెక్కా అని అన్నారు. సంపాదించిన లక్షల కోట్లల్లో ఉల్లిపొరంత ఖర్చు పెడితే నిత్యం ఎదో కుట్రని ప్రచారంలో పెట్టొచ్చు అని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య విషయంలో జగన్ తీరుని త‌ప్పుబ‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news