తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒకే కాలేజీలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్

-

తెలంగాణ రాష్ట్రం లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి వరకు 19 మంది విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది టెస్టు నిర్వహించగా… అందులో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెసిడెన్షియల్ కళాశాల లో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

బుధవారం మరోసారి వీరందరికీ ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ టెస్టు చేయనున్నట్లు తెలిపారు. కాగా గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే నిన్న ఒక్కరోజు కరోనా మూలంగా.. ఒకరు మృతి చెందారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఓమి క్రాన్ ఏడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62 చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version