వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లకు అడ్డంకిగా వర్షం..

-

వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు నేడు, రేపు గుంటూరు వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షపడిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాటు చేస్తున్న వైసీపీ శ్రేణులు. అయితే కాసేపట్లో మంగళగిరి ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ప్లీనరీ వేదికకు సీఎం జగన్‌ చేరుకుంటారు. ప్లీనరీ వేదికకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ప్లీనరీ ప్రాంగణం సందడిగా మారింది. అయితే.. మంగళగిరిలో వర్షం మొదలైంది.

దీంతో ప్లీనరీ ఏర్పాట్లకు వర్షం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే సభ ప్రాంగణంలో వర్షంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూప్‌ టెంట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ప్లీనరీ సమావేశాలకు హాజరవుతున్న వారికి నోరూరించే మెనూకూడా ఓవైపు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version