టీడీపీ సీనియర్ కి షాక్ ఇచ్చిన కూతురు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం కాక రేపుతుంది. తాను చీకటి జీవోల ద్వారా ట్రస్ట్ చైర్మన్ అవ్వలేదని, పట్ట పగలు అందరి సమక్షంలో చైర్మన్ అయ్యాను అని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతి రాజు స్పష్టం చేసారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. మాత తాతగారు పీవీజి రాజు గారి వారసత్వం కొనసాగించడానికి నాకు హక్కు ఉంది.

రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నాపై విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పను. టీడీపీ నాయకులు ఒక మహిళ ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు…? మహిళా సాధికారిత కోసం ఎన్టీఆర్ పని చేసారు. నేను చీకటి జీవోల ద్వారా పదవిలోకి రాలేదు. 2016 లో నా తండ్రి ఆనంద గజపతి మరణించారు. నా తండ్రి చితి ఆరాక ముందే అశోక్ చైర్మన్ అయ్యారు. వాటికన్ సిటీకి వెళ్లి ఫోటో దిగితే క్రిస్టియన్ అవుతానా…?

ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ధన్యావాదాలు చెప్తే రాజకీయ కోణం చూస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ట్రస్ట్ చైర్మన్ గా నా పని తనం చూసి మాట్లాడాలి. నేను హిందువుని నా మతం గురించి బాబాయి మాట్లాడటం బాధ వేస్తుంది. అశోక్ ఎప్పుడూ చర్చి కి మసీదుకి వెళ్ళలేదా…? ఇది పూర్తిగా మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన అంశం. ట్రస్ట్ బోర్డ్ లో అతిధిని తీసుకున్నప్పుడు నన్ను ఎందుకు ఎంపిక చేయలేదు…? నా అభ్యర్ధనను కొనసాగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగలను.

Read more RELATED
Recommended to you

Exit mobile version