టాలీవుడ్ సింగర్ కౌసల్య కు కరోనా..బెడ్ పై నుంచి లేవలేని స్థితి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ల తో పాటు.. పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. ఇక అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ కౌసల్య కు కరోనా సోకింది.

దీంతో ఆమె ఫోన్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి లక్షణాలు తీవ్రం గానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం గా ఉంది. కనీసం బెడ్ పై నుంచి కూడా లేవ లేక పోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి.. మరి ఇంత ఇబ్బంది పెడుతోంది. నిన్నటి నుంచి మందులు వేసుకోవటం మొదలు పెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి ముందుకు ఎప్పటిలాగే వస్తాను. దయచేసి అందరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి “అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది సింగర్ కౌసల్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version