బాలీవుడ్ బాక్సాఫీస్ కు ’సూర్యవంశీ‘ కిక్.. 5 రోజుల్లోనే వంద కోట్లు వసూలు.

-

కరోనా దెబ్బతో కుదేలైన బాలీవుడ్ పరిశ్రమకు అక్షయ్ కుమార్ సూర్యవంశీ మూవీ కొత్త కిక్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విడుదలై రికార్డ్ ల దుమ్ము దులుపుతోంది. కేవలం 5 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటి వసూళ్లను రాబట్టింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి నిర్మించి డైరెక్ట్ చేశాడు. ’అభిమానులందరికీ ప్రేమను కురిపించినందుకు ధన్యవాదాలు, దేశీయ మార్కెట్లలో సూర్యవంశీ రూ. 102.81 కోట్లు వసూలు చేసింది‘ అని సోషల్ మీడియాలో రోహిత్ శెట్టి తెలియజేశాడు. నవంబర్ 5న థియేటర్లలో విడుదల అయిన ‘సూర్యవంశీ’లో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ కూడా కీలక పాత్రలు పోషించారు.

రోహిత్ శెట్టి నిర్మించిన ఈచిత్రం కరోనా కారణంగా పలుసార్లు థియేటర్ విడుదలకు నోచుకోలేదు. గతేడాది కూడా కరోనా మహమ్మారి వల్ల విడుదలకు నోచుకోలేదు. చాలా కాలం తరువాత ప్రస్తుతం థియేటర్లలో విడుదలైంది. దీంతో ఈసినిమాకు అభిమానుల కూడా బ్రహ్మరథం పట్టారు. ఈచిత్రంలో అక్షయ్ కుమార్ పోలీస్ అవతారంలో కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news