ఇంకా విషమంగానే బాలూ ఆరోగ్యం, శభరిమలలో ప్రత్యేక పూజ…!

-

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో వెంటిలేటర్ మరియు ఇసిఎంఓ సపోర్ట్ తో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనసాగుతున్నారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. “ఎంజిఎం హెల్త్‌ కేర్‌లో కరోనా కారణంగా జాయిన్ అయిన ఎస్పీ బాలూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని పేర్కొన్నారు. ఫిజియో థెరపీలో ఆయన చాలా చురుకుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఆయన్ను మా మల్టీడిసిప్లినరీ క్లినికల్ బృందం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది అని ఎంజిఎం హెల్త్‌కేర్ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఈ నెల 5 న ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. అక్కడి నుంచి ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవడం కోసం ఒక ప్రత్యేక ప్రార్థన కూడా చేసారు. ‘ఉషా పూజ’ నిర్వహించారు శబరిమల ఆలయంలో. ఆయన కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version