ఎస్పీ బాలు కోసం మృత్యుంజయ హోమం

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కు గురై చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి కొన్నిరోజులుగా విషమంగానే ఉంది. ఇప్పటికే బాలు కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన అనారోగ్యం నుండి కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో కూడా సంగీత సమర్పణ చేశారంటే ఆయన కోలుకోవాలని ఏ మేరకు ప్రార్ధనలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా విజయవాడలో ఎస్.పి. బాలసుబ్రమణ్యం కోసం మృత్యుంజయ హోమం చేస్తున్నారు. ఎస్.పి. బాలసుబ్రమణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఈ మృత్యుంజయ హోమం చేస్తున్నట్టు చెబుతున్నారు. వేదపండితులు, ఎస్పీ బాలు అభిమానుల ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది. దాదాపు 4గంటల పాటు సాగిన హోమంలో 1011సార్లు మృత్యుంజయ మంత్రం జపించారు. మహా పూర్ణాహుర్తితో కొద్ది సేపటి క్రితమే హోమం ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news