స్పీడ్ పెంచిన‌ కృతి శెట్టి.. శ‌ర్వ‌నంద్‌తో సినిమా!

-

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన కృతి శెట్టి.. మొద‌టి సినిమా తోనే కావాల్సినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో కృతి శెట్టి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ గా గ‌డిపేస్తుంది. కృతి శెట్టి న‌టించిన ఉప్పెన సినిమాతో పాటు శ్యామ్ సింగ రాయ్, బంగ‌ర్రాజు వంటి సినిమా బ్లాక్ బాస్ట‌ర్ కావ‌డంతో మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు వ‌చ్చి చేరుతున్నాయి. ప్ర‌స్తుతం హీరో సుధీర్ బాబుతో ఆ ఆమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తుంది. అలాగే రామ్ పోతినేని.. వారియ‌ర్ సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది.

కాగ తాజా గా మ‌రో సినిమాకు కృతి శెట్టి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వ‌నంద్ హీరో గా ఇటీవ‌ల వ‌చ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా థీయేట‌ర్ల‌లో సందిడి చేస్తుంది. ఈ సినిమా త‌ర్వ‌త శ‌ర్వ‌నంద్.. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. కాగ ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. కృతి శెట్టి అందం తో పాటు అభినయంతో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటుంది. దీంతో వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version