BREAKING : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

-

టీమిండియా జట్టులో కరోనా కల్లోలం కలవరపెడుతోంది. ఇప్పటికే టీమిండియా ఆల్‌ రౌండర్‌ ఆర్‌. అశ్విన్‌, విరాట్‌ కోహ్లీలకు కరోనా సోకగా.. తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

నిన్న రాత్రి కరోనా లక్షణాలు ఉండటంతో.. రోహిత్‌ శర్మ…. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే..ఈ పరీక్షల్లో.. కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో.. రోహిత్‌ హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లాడు.

అలాగే… రోహిత్‌ శర్మకు సన్నిహితంగా ఉన్న టీం సభ్యులు కూడా క్వారంటైన్‌ కు వెళ్లారు. కాగా… జూలై 1 నుండి ఎడ్జ్‌ బాస్టన్‌లో ప్రారంభమయ్యే వాయిదా పడిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌ కు రోహిత్.. టీమిండియా జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అయితే.. కరోనా సోకడంతో.. రోహిత్‌ శర్మ.. మ్యాచ్‌ ఆడతాడా లేదా తెలాల్సి ఉంది. సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news