చెన్నై సూపర్ కింగ్స్: సురేష్ రైనా, హర్భజన్ లతో కాంట్రాక్ట్ కటీఫ్…

-

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. 9జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. చివరకు విజేతగా ఏ జట్టు నిలుస్తుందో చూడాలి. ఐతే ఈ సారి టోర్నమెంట్లో కరోనా కారణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ ఫేవరేట్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఈ సీజన్ నుండి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే చెన్నై సూపర్ కింగ్ యాజమాన్యం వీరిద్దరితో ఉన్న కాంట్రాక్ట్ ని ముగించుకోవాలని చూస్తోందట.

2017నుండి 2020వరకు మూడు సంవత్సరాలకి ఉన్న కాంట్రాక్టుని ఈ ఏడాదితో ముగించేసుకుంటుందట. ఈ కాంట్రాక్టు ప్రకారం సురేష్ రైనాకి సంవత్సరానికి 11కోట్ల రూపాయలు, హర్భజన్ సింగ్ కి 2కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఐతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడకపోతున్నందున ఈ సంవత్సరం సాలరీ చెల్లించడం లేదట. ఈ విషయమై అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news