Breaking : ఐపీఎల్ మెగా వేలానికి డేట్ ఫిక్స్

-

ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేశ్ ప‌టేల్ తాజా గా కీలక ప్ర‌క‌ట‌న చేశాడు. రాబోయే ఏడాది కోసం జ‌రిగే మెగా వేలం డేట్ ను అనౌన్స్ చేశారు. వ‌చ్చే నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం ఉంటుంద‌ని ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేశ్ ప‌టేల్ ప్ర‌క‌టించారు. ఈ మెగా వేలం కర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూర్ లో జ‌రుగుతుంద‌ని తెలిపారు. అలాగే ఈ ఏడాది కొత్త‌గా వ‌స్తున్న ల‌ఖ్‌న‌వూ, అహ్మ‌దాబాద్ జ‌ట్లకు బీసీసీఐ ఫార్మ‌ల్ క్లియ‌ర‌న్స్ కూడా వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు.

కాగ ఈ రోజు బీసీసీఐ పాల‌క మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం అనంత‌రం ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేశ్ ప‌టేల్ మెగా వేలం, కొత్త ఫ్రొఛైంజ్ ల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ స‌మావేశంలోనే మెగా వేలం వ‌చ్చే నెల 12, 13 తేదీల‌లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ పాల‌క మండ‌లి నిర్ణ‌యించింద‌ని తెలిపారు. అలాగే కొత్త ఫ్రొఛైంజ్ ల‌కు కూడా అనుమ‌తులు ఇచ్చింద‌ని తెలిపారు. అయితే ఈ రెండు కొత్త ఫ్రొఛైంజ్ లు రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల వివ‌రాల‌ను తెల‌పాల‌ని ఆ జ‌ట్ల యాజ‌మాన్య‌ల‌కు సూచించామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news