పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం

-

అహ్మ‌దాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దుమ్ము లేపింది. ఇంకా 14 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ అల‌వోక‌గా ఛేదించింది. పంజాబ్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

delhi won against punjab in ipl 2021 29th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి 166 ప‌రుగులు చేసింది. పంజాబ్ ప్లేయ‌ర్ల‌లో మ‌యాంగ్ అగ‌ర్వాల్ అద్భుతంగా రాణించాడు. 99 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ర‌బాడాకు 3, అవేష్ ఖాన్‌, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు 1 వికెట్ చొప్పున ద‌క్కాయి.

త‌రువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ (69 నాటౌట్), పృథ్వీ షా (39)లు ఢిల్లీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మెరెడిత్‌, జోర్డాన్‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్‌ల‌కు త‌లా 1 వికెట్ చొప్పున ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news