ఐపీఎల్: ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు..

-

ఐపీఎల్ మొదలవడం ఆలస్యమైన అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. దుబాయ్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ ని ప్రత్యక్ష్యంగా చూడడానికి అనుమతి లేనప్పటికీ, టీవీల్లో వీక్షిస్తూ క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే ఈ సారి ధోనీ ఆట చూద్దామని చాలా మంది ఆశగా ఎదురుచూసారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ ఆట చూడాలని అందరూ కోరుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో ధోనీ ప్రదర్శన పెద్దగా చేయలేదనే చెప్పాలి. బ్యాట్స్ మెన్ గా ఏడవ స్థానంలో దిగి విమర్శలు తెచ్చుకున్నాడు.

MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020

 

ఐతే నేడు జరుగుతున్న సన్ రైజర్స్ మ్యాచుతో ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచులాడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. సురేష్ రైనా 193మ్యాచులని సమం చేసిన ధోనీ సన్ రైజర్స్ మ్యాచుతో ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచులాడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం సురేష్ రైనా ఐపీఎల్ సీజన్ ఆడటం లేనందున ఈ రికార్డు ధోనీపైనే ఉండనుంది. ఐతే 192 మ్యాచులతో రోహిత్ శర్మ మూడవ స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ పూర్తయ్యేసరికి రోహిత్ ధోనీ రికార్డుని దాటేస్తాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news