ధోని షాకింగ్ నిర్ణ‌యం.. సీఎస్‌కే నెక్ట్స్ కెప్టెన్ జ‌డేజా!

-

ఐపీఎల్ 2022 కి ముందు మ‌హేంద్ర సింగ్ ధోని షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుక కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన ధోని తాజా గా కెప్టెన్సీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని స‌మాచారం. సీఎస్కే జ‌ట్టు కెప్టెన్ బాధ్య‌త‌ల కు ధోని గుడ్ బై చెప్పాల‌ని నిర్ణించుకున్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యంతో కూడా చ‌ర్చించాడ‌ని స‌మాచారం. అలాగే సీఎస్కే త‌ర్వాతి కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ను ఎంపిక చేయాల‌ని కూడా నిర్ణించుకున్న‌ట్టు తెలుస్తుంది.

జ‌డేజా కెప్టెన్సీ బాధ్య‌తల గురించి కూడా చెన్నై యాజ‌మాన్యంతో ధోని చ‌ర్చించాడని తెలుస్తుంది. ధోని నిర్ణ‌యానికి చెన్నై యాజ‌మాన్యం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కాగ వ‌చ్చే ఐపీఎల్ 2022 కి ముందే దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అలాగే ఐపీఎల్ 2022 త‌ర్వాత ఐపీఎల్ కు ధోని పూర్తిగా దూరం ఉంటాడాని కూడా సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వ‌స్తున్నాయి. కాగ దీనిపై ధోని గానీ జడేజా గానీ చెన్నై యాజ‌మాన్యం గానీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news