క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: 2022 ఐపీఎల్​ లో కూడా ధోని…!

-

ఈ ఏడాదితో పాటు రానున్న రెండేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కి ధోనీ కెప్టెన్​గా ఉంటాడని సీఎస్క్​కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. గతవారం స్వస్థలం రాంచీలోని ఇండోర్ అకాడమీ ప్రాక్టీసు చేశాడు. ఆగస్టు 16-20 మధ్య జరగబోయే శిక్షణా శిబిరంలో పాల్గొనున్నాడని సమాచారం.

గతేడాది ప్రపంచకప్​లో చివరగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్​లో ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. మార్చిలో కరోనా రావడం, లీగ్​ నిరవధిక పడటం, టీ20 ప్రపంచకప్​ వాయిదా.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది.​ఐపీఎల్ 2020, 2021లో ధోనీ ఆడతాడు. 2022లోనూ జట్టులోనే ఉంటాడు. ధోనీ ప్రాక్టీసు చేస్తున్నాడని నాకు మీడియా ద్వారానే తెలిసింది. కెప్టెన్ ఫామ్ గురించి మాకు కంగారేమి లేదు.​ తన బాధ్యతలేంటో మహీకి తెలుసు అని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news