అహ్మాదాబాద్ జ‌ట్టు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్య!

-

ఇటీవ‌ల ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్న టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య గుడ్ న్యూస్ అందిన‌ట్టు తెలుస్తుంది. రాబోయే ఐపీఎల్ కు కోత్తగా వ‌చ్చిన అహ్మాదాబాద్ ఫ్రొంఛైజ్ కీలక నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ అహ్మాదాబాద్ జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాల‌ని హార్ధిక్ పాండ్య‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. గ‌త ఐపీఎల్ హార్ధిక్ పాండ్య ముంబై ఇండియ‌న్స్ జట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో రిటేన్ష‌న్ ప్ర‌క్రియలో భాగంగా హార్ధిక్ పాండ్యను ముంబై ఇండియ‌న్స్ ఫ్రొంఛైంజ్ వ‌దులుకుంది.

అయితే కొత్త‌గా వ‌చ్చిన రెండు జ‌ట్లు ముగ్గురిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అహ్మ‌దాబాద్ ఫ్రొంఛైంజ్ ఆట‌గాళ్లతో సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. అయితే ఈ జట్టు కెప్టెన్ గా ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య‌ను ఎంపిక చేసుకోవాల‌ని భావించిన‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ విష‌యం హార్ధిక్ పాండ్య‌తో కూడా చ‌ర్చించినట్టు స‌మాచారం. అయితే దీని పై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. కాగ ఐపీఎల్ 2022 కోసం వ‌చ్చే నెలలో బీసీసీఐ మెగా వేలం నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news