ఐపీఎల్: ఇండియన్ టీమ్ లో చేరడానికి అతడు రెడీ.. ఆకాష్ చోప్రా..

-

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా, ముంబై ఇండియన్ బ్యాట్స్ మెన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ఆటని మలుపు తిప్పిన సూర్య కుమార్ యాదవ్ పై తనదైశ శైలిలో కామెంట్లు చేసాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో 32బంతుల్లో 53పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్, మరికొద్ది రోజుల్లో ఇండియా తరపున క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో అతడి విధానం తనకి చాలా నచ్చిందని, మ్యాచుని పూర్తిగా మలుపు తిప్పాడని అన్నారు.

నా ప్రకారం సూర్య కుమార్ యాదవ్, ఈ ఏడాది చివరికల్లా ఇండియా టీమ్ లో చేరతాడు అని చెప్పాడు. ముంబై ఇండియన్స్ టీమ్ లో చురుగ్గా ఉంటున్న సూర్య కుమార్ యాదవ్, ఇప్పటి వరకూ ఏడు మ్యాచులాడి 233పరుగులు చేసాడు. ఈ సీజన్లో ముంబై బ్యాట్స్ మెన్ తరపున ఇదే అత్యధికం. రెండు అర్థ సెంచరీలతో పాటు ప్రతీ మ్యాచులో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిలో పడుతున్నాడు. మరి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా భావించినట్టు సూర్య కుమార్ యాదవ్, ఈ ఏడాది చివరికల్లా ఇండియా టీమ్ లో చేరతాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news