ఐపీఎల్: కింగ్స్ పంజాబ్ పై ముంబై ఘనవిజయం..

-

ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండవ విజయం చేరింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 48 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘనవిజయం అందుకుంది. 192పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, లక్ష్య ఛేధనలో వెనకబడిపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ జట్టు స్కోరు 38పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత మరో పరుగుకే కరుణ్ నాయర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 60పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.

నికోలస్ పూరన్ తనదైన ఆటతో 44పరుగులు చేసి, జట్టుకి డీసెంట్ స్కోరు అందించాడు. మిగతా వారెవరూ పెద్దగా చెప్పుకోదగ్గ పార్ ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. కేఎల్ రాహుల్ 17పరుగులు( 19బంతుల్లో 1ఫోర్) చేయగా, మయాంక్ అగర్వాల్ 25పరుగులు (18బంతుల్లో 3ఫోర్లు), నికోలస్ పూరన్ 44
పరుగులు ( 27బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), క్రిష్ణప్ప గౌతమ్ 22 (13బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) చేసారు. ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 18పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news