ఐపీఎల్: రాణించిన బ్యాట్స్ మెన్.. సన్ రైజర్స్ లక్ష్యం 168..

-

చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ అందరూ ఓ మోస్తారుగా రాణించడంతో డీసెంట్ స్కోరు (6 వికెట్లు కోల్పోయి167 పరుగులు) అందుకుంది. ఓపెనర్ గా దిగిన డుప్లెసిస్ డకౌట్ గా మిగలగా సామ్ కరేన్ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21బంతులాడిన సామ్ కరేన్ 3ఫోర్లు, 2సిక్సర్లతో 31పరుగులు చేసాడు.

ఆ తర్వాత వచ్చిన షేన్ వాట్సన్ కి అంబటి రాయుడు మంచి జోడీగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరుని పరుగులు పెట్టించారు. షేన్ వాట్సన్ 42పరుగులు (38బంతుల్లో 1ఫోరు, 3సిక్సర్లు) చేసాడు. అంబటి రాయుడు 41పరుగులు( 34బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) చేసాడు. మిగతా వారిలో ధోనీ 21పరుగులు (13బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్), రవీంద్ర జడేజా 25పరుగులు (10బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్) చేసారు. సన్ రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మెద్, టి నటరాజన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news