ఐపీఎల్: ఢిల్లీపై మ్యాచ్ తో కోహ్లీ సెట్ చేసిన సరికొత్త రికార్డు..

-

సోమవారం జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. ఐతే ఈ మ్యాచులో కోహ్లీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసాడు. ఐపీఎల్ మొదటి సీజన్ నుండి బెంగళూరుకి ఆడుతున్న కోహ్లీ ఈ రికార్డఉ సాధించాడు. ఒకే టీమ్ తరపున 197మ్యాచులాడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సోమర్ సెట్ కి చెందిన జేమ్స్ హిల్ డ్రెత్ పై ఉండేది.

మొత్తం 197మ్యాచులాడిన కోహ్లీ, 37.77 సగటు, 132 స్ట్రైక్ రేట్ తో 5969పరుగులు చేసాడు. మొత్తం 5 సెంచరీలు, 39అర్థ సెంచరీలు చేసాడు. ఇదే కాదు ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు. ఒకే సీజన్లో 900 పరుగులు చేసి ఆ రికార్డు అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news