ముంబైతో మ్యాచుతో కోహ్లీ ఖాతాలో చేరనున్న సరికొత్త రికార్డు..

-

ఐపీఎల్ లో నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లలో బెంగళూరుకి విజయం చాలా అవసరం. పంజాబ్ తో అత్యంత ఘోరంగా ఓడిపోవడం వల్ల అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఐతే నేటి మ్యాచులో కోహ్లీ సరికొత్త రికార్డుని అందుకోనున్నాడు. ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ కెప్టెన్ గా 150మ్యాచులాడిన నాలుగవ ఆటగాడిగా రికార్డులకి ఎక్కుతాడు. కోహ్లీ కంటే ముందు, ధోనీ, డారెన్ సామీ, గౌతమ్ గంభీర్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

ముంబైతో జరగనున్న మ్యాచుతో కెప్టెన్ గా 150 ట్వంటీ ట్వంటీ మ్యాచులాడిన ఘనత దక్కుతుంది. ఐపీఎల్ లెక్కల్లో చూసుకుంటే కోహ్లీ 112మ్యాచులకి కెప్టెన్ గా చేసాడు. ధోనీ 177మ్యాచులతో, గౌతమ్ గంభీర్ 129మ్యాచులతో ముందు వరుసలో ఉన్నారు. మ్యాచు ప్రారంభంతో రికార్డు తన ఖాతాలో వేసుకునే కోహ్లీ, తనదైన పర్ ఫార్మెన్స్ తో విజయాన్ని తన జేబులో వేసుకుంటాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news