మళ్లీ ఇంకో కొత్త అవ‌తారంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఫొటోలు వైర‌ల్‌..

-

టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త లుక్స్ ను ట్రై చేస్తుంటాడు. ఇటీవ‌లే నూత‌న త‌ర‌హాలో హెయిర్ క‌ట్ చేయించుకుని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఫ్యాన్స్ ధోనీ కొత్త స్టైల్‌ను చూసి సంబ‌ర‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త లుక్‌లో ధోనీ సంద‌డి చేస్తున్నాడు.

ms dhoni new look again trends in social media

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌కు అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ ధోనీకి చెందిన కొత్త లుక్ ఫొటోను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు స్టార్ స్పోర్ట్స్ ఇండియా ట్వీట్ చేసింది. #AsliPictureAbhiBaakiHai అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆ పోస్ట్ ను ట్వీట్ చేశారు. అందులో ధోనీ వెరైటీ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

అయితే త్వ‌ర‌లో ఐపీఎల్ 2021 రెండో దశ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ టోర్నీకి చెందిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ధోనీ అలా పాల్గొని ఉంటాడ‌ని తెలుస్తోంది. అందుక‌నే ధోనీ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇక సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో ద‌శ ప్రారంభం కానుండ‌గా ఆ రోజు చెన్నై టీమ్ ముంబైని ఢీకొట్ట‌నుంది. ఏప్రిలో 29 మ్యాచ్‌లు జ‌రిగాయి. కోవిడ్ కేసులు రావ‌డంతో ఐపీఎల్‌ను వాయిదా వేశారు. దీంతో మిగిలిన 31 మ్యాచ్‌లను త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈసారి అన్ని మ్యాచ్‌లు యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news