ఐపీఎల్: ముంబై చేతికి మరో ఘనవిజయం.. వికెట్ నష్టపోకుండా..

-

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో చెన్నైపై వికెట్ నష్టపోకుండా చాలా సునాయాసంగా ముంబై ఇండియన్స్ విజయాన్ని దక్కించుకుంది. 115పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుని ఓపెనర్లే గెలిపించారు. క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్ కలిసి ముంబైకి మరపురాని విజయాన్ని అందించారు. 37బంతులాడిన డికాక్ 5ఫోర్లు, 2సిక్సర్లతో 46పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 68పరుగులు( 37బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) చేసాడు.

వీరిద్దరూ చెలరేగిపోవడంతో ముంబై ఖాతాలోకి మరో విజయం చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. నాలుగు ఓవర్లు వేసిన బౌల్ట్, ఒక మెయిడెన్ తో పాటు నాలుగు వికెట్లు తీసుకుని 18పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తానికి ముంబై బౌలర్ల ధాటికి చెన్నై కుప్పపూలిపోయి విజయాన్ని ముంబై ఇండియన్స్ చేతికి ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news